AP: అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. అటు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
భారీ వర్షాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
28
Aug