AP: సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం కొందరికే అమలు చేస్తోందని APCC చీఫ్ షర్మిల ఆరోపించారు. 76.07 లక్షల మంది రైతులుంటే 47 లక్షల మందికే అన్నదాత సుఖీభవ ఇస్తోందని, ఇది అన్నదాత దు:ఖీభవ అని సెటైర్ వేశారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే రూ.20వేలు ఇస్తుందని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన బాబు, ఇప్పుడేమో రూ.14వేలే ఇస్తున్నారని మండిపడ్డారు. అన్ని పథకాలు సగం మందికే వస్తున్నాయని షర్మిల ట్వీట్ చేశారు.
అన్నదాత సుఖీభవ కాదు దు:ఖీభవ: షర్మిల
02
Aug