వీకే పాండియన్ తన రాజకీయ వారసుడు కాదని ఒడిశా మాజీ CM, BJD అధినేత నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తన రాజకీయ వారసుడెవరో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ‘పాండియన్పై విమర్శలు రావడం దురదృష్టకరం. IAS అధికారిగా రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు. బ్యూరోక్రాట్ నుంచి BJDలో చేరినా ఎలాంటి పదవులు ఆశించలేదు. ఇలాంటి నిజాయతీ గల వ్యక్తిని గౌరవించాలి’ అని అన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో BJP 78, BJD 51 స్థానాల్లో నెగ్గాయి.
పాండియన్ నా రాజకీయ వారసుడు కాదు: నవీన్ పట్నాయక్
09
Jun