AP: ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.54 లక్షల క్యూసెక్కులుగా ఉందని పేర్కొంది. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని హెచ్చరించింది. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయరాదని సూచించింది. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
పెరుగుతున్న వరద.. ప్రజలకు అలర్ట్: APSDMA
01
Aug