తెలంగాణలో మెడిసిన్ చదివే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వరుసగా 9 ,10, 11, 12 తరగతులు చదివితేనే స్థానికత వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్కు ముందు వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందన్న ప్రభుత్వ జీవో నంబర్ 33ని సమర్థించింది. గత ఏడాది ఇచ్చిన మినహాయింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థులను అలాగే కొనసాగించాలని సూచించింది.
మెడికల్ స్టూడెంట్స్కు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి: సుప్రీంకోర్టు
02
Sep