దేశంలోనే తొలి విమానాశ్రయం.. 150 గమ్యస్థానాలకు విమానాలు!

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు సృష్టించింది. 150 గమ్యస్థానాలను కనెక్ట్ చేసిన తొలి భారత ఎయిర్పోర్టుగా నిలిచింది. థాయ్ ఎయిర్హోషియా ఎయిర్లైన్ ఇటీవల ఢిల్లీ- డాన్ ముయాంగ్ (బ్యాంకాక్) మధ్య విమానాలను ప్రారంభించడంతో ఈ మైలురాయిని సాధించినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL) ప్రకటించింది. ఢిల్లీ నుంచి రోజూ 1,400 ఫ్లైట్స్ రాకపోకలు సాగిస్తున్నట్లు పేర్కొంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *