మామే తండ్రయ్యాడు.. కోడలికి రెండో పెళ్లి చేశాడు

పెళ్లి చేసిన ఏడాదికే కొడుకు గుండెపోటుతో చనిపోయాడు. నెలల వయసున్న కుమార్తెతో కోడలు విధవరాలిగా అత్తింట మిగిలిపోయింది. దీంతో ఆ మామగారు ఆమెకు తండ్రయ్యాడు. కుమారుడి స్నేహితుడికిచ్చి పెళ్లి జరిపించాడు. కోడలికి భర్తను, మనవరాలికి తండ్రిని అందించాడు. కన్నీటితో ఆమెను అత్తింటికి సాగనంపాడు. గుజరాత్లోని అంబాజీ టౌన్లో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. సదరు మామగారు ప్రవీణ్ సింగ్ రాణాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *