ట్రంప్ టారిఫ్స్.. భారత్కు ఇరాన్ మద్దతు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల పెంపు ప్రకటన నేపథ్యంలో భారత్కు ఇరాన్ ఎంబసీ మద్దతుగా నిలిచింది. భారత్, ఇరాన్ వంటి స్వతంత్ర దేశాల అభివృద్ధికి ఆటంకం కలిగించేలా ఆంక్షలను యూఎస్ ఆయుధంగా వాడుకుంటోందని దుయ్యబట్టింది. ఇలాంటి వివక్షతో కూడిన చర్యలు అంతర్జాతీయ చట్టం, జాతీయ సార్వభౌమాధికార సూత్రాలను ఉల్లంఘిస్తాయని దుయ్యబట్టింది. ఇలాంటి విధానాలను ప్రతిఘటించడమే తమ స్టాండ్ అని స్పష్టం చేసింది.