AP: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఇవాళ అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించనున్నారు. ఉదయం గన్నవరం నుంచి హెలికాప్టర్లో లగిశపల్లికి చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో వంజంగి గ్రామానికి వెళ్తారు. గిరిజన సంప్రదాయాలపై అడవి బిడ్డలతో ముచ్చటిస్తారు. అనంతరం ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని ప్రసంగిస్తారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత కూటమి నేతలతో భేటీ అవుతారు.
నేడు అల్లూరి జిల్లాలో సీఎం పర్యటన
13
Aug