నిత్యం రాకపోకల కోసం సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది.

TG: 2 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకల కోసం సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. నిర్మల్ (D) కల్లూరు- పాత బూరుగుపల్లి మధ్య సుద్దవాగుపై ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకల కోసం ప్రజలు పైపునే నమ్ముకున్నారు. అవతలి వైపు ఉన్న పొలాలకు వెళ్లేందుకు ప్రమాదకరంగా వాగు దాటుతున్నారు. ఏ మాత్రం అదుపు తప్పినా వాగులో కొట్టుకుపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *