TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై తుది నివేదికను ప్రభుత్వానికి కమిషన్ అందజేసింది. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు 2 సీల్డ్ కవర్లలో నివేదిక సమర్పించింది. దీన్ని అధ్యయనం చేసి వివరాలను ఇరిగేషన్ శాఖ ప్రభుత్వానికి తెలియజేయనుంది.
ఆ తర్వాత సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. కాగా గతంలో కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ సహా హరీశ్ రావు, ఈటల, అప్పటి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.