అనంత: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ల
చెల్లుబాటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఉద్యోగి వినియోగించుకున్న పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అయ్యేలా ఎన్నికల సంఘం సూచించిన నియమావళిని హైకోర్టు సమర్ధించడం హర్షనీయమన్నారు.