ఈ నెల 4వ తేది ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కంబదూరు మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ తన సిబ్బందితో మండలంలో ఆదివారం గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ అల్లర్లకు పాల్పడితే కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. బాణసంచా కాల్చకూడదన్నారు. 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. కావున ఎవరు గుంపులుగా వుండరాదన్నారు. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా సంయమనం పాటించాలన్నారు.
ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా కంబదూరు మండలంలో పటిష్ట బందోబస్తు
02
Jun