TG: బీఆర్ఎస్ హయాంలో పంటలు సాగు చేయని వారికీ రైతు బంధు ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. దీనివల్ల పథకం దుర్వినియోగమైందనే భావన ప్రజల్లో ఉందని తెలిపారు. అందుకే సాగు చేసే వారికే రైతు భరోసా ఇవ్వాలని తమ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పంటల బీమా పథకాన్ని కూడా అర్హులకే వర్తించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
వారికే రైతు భరోసా: మంత్రి
15
Jun