AP: అన్న ప్రసాదాల తయారీకి సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపేయాలని TTD భావిస్తున్నట్లు వచ్చిన వార్తల్ని దేవస్థానం ఖండించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వ్యాప్తి అవుతున్నాయని స్పష్టం చేసింది. ‘స్వామివారికి నివేదించే అన్నప్రసాదాలు, వాటి దిట్టం గురించి ఈవో శ్యామలరావు సుదీర్ఘంగా చర్చించిన మాట వాస్తవం. అయితే వాటిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తప్పుడు వార్తల్ని నమ్మొద్దు’ అని స్పష్టం చేసింది.
అవన్నీ తప్పుడు ప్రచారాలే: టీటీడీ
04
Jul