ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో జిల్లాలోని ఆలయాల్లో గోరింటాకు సంబరాలు మొదలయ్యాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి మందిరంలో ఆర్యవైశ్య వాసవీ మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలు తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. ఈ నెల రోజులపాటు తమకు పండగేనని, ఆరోగ్యాన్ని పెంపొందించే గోరింటాకు పెట్టుకునే ఈ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అంతకుముందు గౌరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆదిలాబాద్లో గోరింటాకు సంబరాలు
08
Jul