తన తల్లిని కాపాడినందుకు షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వజీద్ జాయ్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం బంగ్లాలో మూకస్వామ్యం కొనసాగుతోందన్నారు. చీఫ్ జస్టిస్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్, పోలీసు చీఫ్ సహా ఉన్నతాధికారులను తొలగిస్తున్నారని చెప్పారు. ఇవే మూకలు రేపు తమకు నచ్చిన వ్యక్తుల్ని తాత్కాలిక ప్రభుత్వంలో నియమించాలని డిమాండ్ చేస్తాయన్నారు. హసీనా బంగ్లాకు వెళ్లాలని భావిస్తున్నట్టు వివరించారు.
భారత్కు థాంక్స్: హసీనా కుమారుడు
12
Aug