AP: తనను యూట్యూబర్ హర్షసాయి మోసం చేశాడని ఫిర్యాదు చేసిన యువతి మరోసారి నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. హర్షసాయి తనపై సోషల్ మీడియాలో కావాలని ట్రోలింగ్ చేయిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించారు. ట్రోలింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఇప్పటికే హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైంది. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హర్షసాయిపై మరో ఫిర్యాదు
05
Oct