TG: నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పందించారు. మధ్యాహ్న భోజనానికి ముందు 22 మంది విద్యార్థులు బేకరీలు, దుకాణాల్లో తినుబండారాలు తిన్నారని తెలిపారు. మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురి కాలేదన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని చెప్పారు.
మధ్యాహ్న భోజనం కాదు బేకరీ ఫుడ్ వల్లే అస్వస్థత: కలెక్టర్
27
Nov