శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి రైళ్లలో వెళ్లే మాలధారులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. రైలు కోచ్లలో కర్పూరం, అగరబత్తి వెలిగించడం, హారతి ఇవ్వడం చేయవద్దని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రైల్వే యాక్ట్ 67, 154, 164, 165 సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణించి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ చర్యలతో రైలులో అగ్నిప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వివరించింది.
కర్పూరం వెలిగించవద్దు, హారతి ఇవ్వొద్దు: అయ్యప్పలకు రైల్వే సూచన
06
Dec