‘
‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. RTC క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద రాత్రి జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి(39) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమెను బతికించేందుకు పోలీసులు CPR చేసినా ఫలితం దక్కలేదు. ఆమె కుమారుడు శ్రీతేజ్(9) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఓ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మహిళ కూతురు శాన్వీ (7) కూడా గాయపడినట్లు తెలుస్తోంది.
పుష్ప 2′: తొక్కిసలాటలో మహిళ మృతి
06
Dec