సీఎం చంద్రబాబు
AP: ప్రపంచంలో ఎక్కడ చూసినా సాంకేతికతపైనే చర్చ జరుగుతోందని, అది మనిషి జీవితంలో భాగమైందని CM చంద్రబాబు చెప్పారు. విశాఖలో జరుగుతున్న డీప్టెక్ సదస్సులో మాట్లాడుతూ ‘టెక్నాలజీకి మేం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. నూతన సాంకేతిక ఆవిష్కరణల్లో ఇతర దేశాలతో పోటీ పడుతున్నాం. నాలెడ్జ్ హబ్ గా AP తయారవుతోంది. ప్రస్తుతం డ్రోన్లు కూడా కీలకంగా మారాయి. అన్ని పనులు డ్రోన్ల ద్వారా చేసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.