ఇండియా కూటమి నాయకత్వానికి తాను సిద్ధమేనని బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. ‘ఆ కూటమిని నేనే ఏర్పాటు చేశా. ఇప్పుడు దానిని నడిపిస్తున్నవాళ్లకు నిర్వహణ చేతకాకుంటే నేనేం చేయగలను? అందరూ ఐక్యంగా ముందుకు సాగండనే చెప్తాను. బెంగాల్ను విడిచివెళ్లడం నాకిష్టం లేదు. అవకాశం లభిస్తే ఇక్కడి నుంచే నడిపిస్తాను’ అని అన్నారు. ఇక తన వారసుడిని నిర్ణయించే బాధ్యత పార్టీదేనని, సమష్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇండియా కూటమిని నడిపించేందుకు సిద్ధం: మమత
08
Dec