కుంభమేళాకు వెళ్లే భక్తులకు సగం ధరకే విమాన ప్రయాణం చేయొచ్చని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఇందుకు సంబంధించి అన్ని ఎయిర్లైన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. కాగా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ వెళ్లే అన్ని విమాన సంస్థలు భారీగా టికెట్లు రేట్లు పెంచాయి. దీనిపై కేంద్రానికి వినతులు వెల్లువెత్తడంతో 50 శాతం ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది.