TG: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద ధన్వాడ గ్రామ సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. దీని వల్ల తమకు నష్టం జరుగుతుందని నిరసనకు దిగారు. ఫ్యాక్టరీ పనులు మొదలవ్వడంతో కంపెనీకి చెందిన కార్లు, సామగ్రి తగలబెట్టారు. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన.
05
Jun