అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారని అహ్మదాబాద్ సీపీ GS మాలిక్ వెల్లడించారు. ’11A సీటులోని విశ్వాస్ కుమార్ రమేశ్ (40) బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంత మంది చనిపోయారనే దానిపై ఇప్పుడే వివరాలు చెప్పలేను. విమానం జనావాసాలపై పడింది కాబట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది’ అని ఆయన తెలిపారు. కాగా విశ్వాస్ ఛాతి, కన్ను, కాలికి గాయాలయ్యాయి.
విమాన ప్రమాదం.. బతికిన ఒకే ఒక్కడు ఇతడే
13
Jun