AP: శ్రీకాకుళం జిల్లా, సోంపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాలవలసకు చెందిన రాజేశ్వరి (25) మృతదేహం ఎర్రముక్కాం గ్రామ సమీప జీడి తోటల్లో సోమవారం కనిపించింది. ఈ ఘటన అక్కడ స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 5 రోజుల క్రితం మందస మండలం పీడీ మందసలోని పుట్టింటికి వెళ్లిన రాజేశ్వరి అదృశ్యమైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయంతో గాలింపు చర్యలు చేపట్టగా కాలిపోయిన స్థితిలో దొరికింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో దారుణం.. జీడితోటలో సగంకాలిన వివాహిత మృతదేహం
17
Jun