భూమిపైకి చేరుకున్న శుభాంశు శుక్లా బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. శుభాంశు శుక్లా టీమ్ భూమికి సురక్షితంగా చేరుకోవడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ISSను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాంశు.. పట్టుదల, అంకితభావం, సాహస చర్యల ద్వారా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని ఎక్స్ వేదికగా కొనియాడారు. ఇది మన సొంత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్కు దిక్సూచిగా నిలుస్తుందని ప్రధాని అన్నారు
శుభాంశు శుక్లా బృందానికి ప్రధాని మోదీ అభినందనలు
17
Jul