కర్ణాటకలోని బెలగావి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ తన ప్రియుడితో భర్తను దారుణంగా చంపించింది. కమల, ఈరప్పకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. కొన్ని రోజులుగా కమల సమీపంలోని హోటల్లో పని చేస్తుండగా.. అక్కడ సాబప్పతో పరిచయం ఏర్పడి ఎఫైర్కు దారి తీసింది. దీంతో ఈరప్పను చంపాలని ప్రియుడిపై ఒత్తిడి చేసింది. చంపకపోతే విషం తాగి చనిపోతానని బెదిరించింది. ఈ క్రమంలో సాబప్ప మద్యం తాగుతున్న ఈరప్పను తీసుకెళ్లి దారుణంగా చంపేశాడు.
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ
17
Jul