‘
విద్యార్థుల్లో క్రమశిక్షణను, జ్ఞానాన్ని పెంపొందించి, లక్ష్యంపై వారికి స్పష్టమైన అవగాహనను కలిగించి, వారిని కార్య సాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని ఎంపీడివో అంజాద్ ఎంఈవో ప్రకాశ్ అన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల స్థాయిలో ఎంపికైన ఉత్తమ టీచర్లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పీలు, టీచర్లు ఉన్నారు.