TG: జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా ఇవాళ సాయంత్రం బోరబండకు వస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. ‘ఎవరు అడ్డుకుంటారో చూస్తా. కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలి. సాయంత్రం BJP దమ్మేంటో చూపిద్దాం’ అని పిలుపునిచ్చారు. తన మీటింగ్కు పోలీసులు అనుమతి ఇవ్వలేదన్న ప్రచారం నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. అయితే తాము అనుమతి రద్దు చేశామనేది తప్పుడు ప్రచారమని, తమను ఎవరూ అనుమతే కోరలేదని పోలీసులు తెలిపారు.
వస్తున్నా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా: బండి
08
Nov