AP: సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 19న PM మోదీ పుట్టపర్తికి రానున్నారని CM CBN తెలిపారు. అలాగే 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వస్తారన్నారు. ఈ నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంత్రుల కమిటీ అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. కాగా 65 ప్రత్యేక రైళ్లతో పాటు ఈనెల 13 నుంచి డిసెంబర్ 1 వరకు 682 రైళ్లు పుట్టపర్తికి రైల్వే శాఖ నడుపనుందని అధికారులు వివరించారు.
19న పుట్టపర్తికి PM మోదీ రాక: CBN
11
Nov