ప్రధాని మోదీకి విద్యార్థుల గురించి మాట్లాడే తీరిక లేదా : రాహుల్ గాంధీ
CBSE ఆన్ స్క్రీన్ మార్కింగ్ సమస్య నిర్లక్ష్యం కాదని, అదో కుమ్మక్కు అని LoP రాహుల్ ఆరోపించారు. మన్ కీ బాత్లో మామిడి పండ్ల గురించి మాట్లాడిన ప్రధానికి 18.5లక్షల మంది విద్యార్థుల భవితవ్యం గురించి మాట్లాడే తీరిక లేదా అని ప్రశ్నించారు. CBSE టెండర్ నిబంధనను మార్చేసిన ఫలితమే ఇది అని చెప్పారు. 300 DPIతో ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్లతో పరీక్ష పత్రాల స్కానింగ్ చేయాల్సి ఉండగా ఫోన్లతో చేశారని పేర్కొన్నారు