పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిపోవడంతో 28 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 22 మంది గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ రెస్క్యూ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. బస్సు టుర్బాట్ నుంచి క్వెట్టాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితుల కుటుంబాలకు ఆ దేశ PM షెహబాజ్ షరీఫ్ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
లోయలో పడిన బస్సు.. 28 మంది దుర్మరణం
30
May