ఆం ధ్రప్రదేశ్ లో కౌంటింగ్ కు పెద్దగా సమయం లేదు. దీంతో పోలీసులు అన్ని ప్రాంతాలలో మొహరించారు. ఎంతగా అంటే వ్యాపారాలు బంద్ చేయాలని సూచిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కౌంటింగ్ తర్వాత కూడా అల్లర్లు జరుగుతాయని నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. బయట వారిని ఎవరినీ నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వడం లేదు. కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు లాడ్జి యజమానులను ఆదేశించారు. అలాగే కొత్త వ్యక్తులు నియోజకవర్గంలో కనపడితే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్లకపోవడమే మంచిదన్న తరహాలో పోలీసులు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ఒక రకంగా అప్రకటిత కర్ఫ్యూ ను అమలు చేస్తున్నారు.
వ్యా పారాలన్నింటినీ…ప్రధానంగా రాయలసీమ, పల్నాడు జిల్లాల్లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. పల్నాడు జిల్లాలో ఐదు రోజుల ముందు నుంచే వ్యాపారాలను బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కేవలం పాలు, మందులు వంటి అత్యవసరా