చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP: ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఉండదని, రాజకీయ పరిపాలన ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు. నా కోసం ఈ ఐదేళ్లు కార్యకర్తలు ప్రాణాలిచ్చారు. కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు. ఎంపీలందరూ తరచూ వచ్చి నన్ను కలవండి. బిజీగా ఉన్నా మీతో మాట్లాడతా. ప్రతి అంశాన్ని నేనే వింటా. ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలి’ అని ఎంపీలతో CBN వ్యాఖ్యానించారు.