నిర్మల్ జిల్లా ముధోల్లోని జీడీ కంపెనీ సమీపంలో భైంసా-నిజామాబాద్ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీ కొనడంతో బాసర మండలం బిద్రేల్లి గ్రామానికి చెందిన కామన్న (55) అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. భైంసా నుంచి బాసర వైపు వెళ్తున్న బైకును వెనకాల వస్తున్న బైకు ఢీ కొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
నిర్మల్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
08
Jun