ముంబైలో ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ ప్రారంభించిన అటల్ సేతుపై పగుళ్లు రావడం చర్చనీయాంశమైంది. బ్రిడ్జ్ ప్రారంభమైన 6 నెలలకే రోడ్డుపై పగుళ్లు రావడం ఏంటని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ప్రశ్నించారు. ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోందన్నారు. కాగా ముంబై-నవీ ముంబై మధ్య 21.8 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం ₹17,840 కోట్లు ఖర్చు చేశారు.
ప్రధాని ప్రారంభించిన అటల్ సేతుపై పగుళ్లు!
22
Jun