TG: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. సికింద్రాబాద్ ఏరియాలోని డిఫెన్స్ భూముల కేటాయింపు, వరంగల్లో సైనిక్ స్కూల్ ఏర్పాటుతో పాటు మరిన్ని అభివృద్ధి అంశాలపై కేంద్రమంత్రికి రేవంత్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దాదాపు 25 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, కడియం కావ్య ఇతర నేతలు పాల్గొన్నారు.
రాజ్నాథ్ సింగ్ సీఎం రేవంత్ భేటీ
24
Jun