TG: దోస్త్ ఫేజ్-3 రిజిస్ట్రేషన్లను నేటి నుంచి ఈనెల 4వ తేదీ సా.5 గంటల వరకు స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. రేపటి నుంచి ఎల్లుండి సా. 5లోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం మొత్తం 3 దశల్లో సీట్లను కేటాయించాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫేజ్-1, 2 ముగియగా, తాజాగా ఫేజ్-3 ప్రక్రియ ప్రారంభమైంది.
దోస్త్ కౌన్సెలింగ్.. ఈనెల 4 వరకు ఫేజ్-3 రిజిస్ట్రేషన్స్
03
Jul