లక్ష్యం: విజయశాంతి
TG: ఏపీ CM చంద్రబాబుపై కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు. ‘తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారం, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు HYDకు వచ్చినట్లు అందరూ భావించారు. కానీ ఆయనకు TDP ప్రయోజనాలే రహస్య అజెండాగా ఉన్నాయనే అనుమానం కలుగుతోంది. తెలంగాణలో టీడీపీ బలపడటం అసంభవం. బీజేపీతో కలిసి కుట్రలు చేస్తే రెండు పార్టీలూ గల్లంతవుతాయి. ఉద్యమకారులు తిరిగి పోరాటం చేస్తారు’ అని ట్వీట్ చేశారు.