AP: మద్యం మత్తులో వేసుకున్న పందెం ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది. ఇద్దరు వ్యక్తులు పీకలదాకా తాగి పందెం వేసుకుని ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మున్నేరులో దూకారు. వీరిలో ఒకరు ఒడ్డుకు చేరుకోగా, మాడుగుల చంటి అనే వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మద్యం మత్తులో పందెం.. మున్నేరులో దూకి వ్యక్తి గల్లంతు
09
Sep