ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్పై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఇటీవల మసూద్ పాక్లోని బహ్వల్పుర్లో ఓ సభలో ప్రసంగించినట్టు వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన MEA ప్రతినిధి జైస్వాల్, ఈ వార్తలు నిజమైనట్టైతే ఉగ్రవాద కార్యకలాపాల కట్టడిలో పాక్ ద్వంద్వ వైఖరిని ఇది బహిర్గతం చేస్తుందని పేర్కొన్నారు. అయితే మసూద్ తమ దేశంలో లేడంటూ పాక్ బుకాయిస్తోంది.
మసూద్ అజార్పై చర్యలు తీసుకోండి: భారత్
08
Dec