దేశంలో క్షయ వ్యాధి(TB) నిరోధక ఔషధాల కొరత ఏర్పడిందన్న ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. DEC6 నాటికి అన్ని కేంద్రాల్లో 2 నెలలకు పైగా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపింది. మందులను సకాలంలో సరఫరా చేయడానికి చర్యలు తీసుకున్నామంది. కాగా TB కేసుల్లో దేశం టాప్లో ఉంది. 21.69లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. TB కట్టడే లక్ష్యంగా 347 హైఫోకస్ జిల్లాల్లో 100 రోజుల ప్రచారాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.
పుష్కలంగా టీబీ మందులు: కేంద్ర ఆరోగ్య శాఖ
08
Dec