AP: ‘తల్లికి వందనం’ పథకం కింద స్కూలుకు వెళ్తున్న ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన నేపథ్యంలో ‘ఏ ఒక్కరికైనా రూ. 15,000 వచ్చాయా?’ అని వైసీపీ ప్రశ్నించింది. ఎన్నికలకు ముందు ఓ టీడీపీ నేత చేసిన ప్రచార వీడియోను Xలో షేర్ చేసింది.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసింది.