మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్థికలను ఢిల్లీలోని గురుద్వారా మజ్ను కా తిలా సాహిబ్ సమీపంలోని యమునా ఘాట్లో కలిపారు. నిగంబోధ్ ఘాట్లో శనివారం సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. నేడు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు ఈ ఆచారాన్ని పాటించారు. అనంతరం గురుద్వారాలో షాబాద్ కీర్తన (గురు గ్రంథ్ సాహిబ్ సంగీత పఠనం), పాత్ (గుర్బానీ పారాయణం), ప్రార్థనలు చేస్తున్నారు.
యమునా ఒడిలోకి మన్మోహన్ సింగ్ అస్థికలు
30
Dec