AP: బాపట్ల జిల్లాలో ఘోరం జరిగింది. భార్యా భర్తల మధ్య ఘర్షణ జరగ్గా.. భర్తను భార్య చంపేసింది. నిజాంపట్నం(M) గోకర్ణమఠంకు చెందిన అమరేంద్రకు అరుణతో 12 ఏళ్ల కిందట వివాహమైంది. మద్యానికి బానిసైన అమరేంద్ర భార్యతో తరచూ గొడవపడేవాడు. మంగళవారం రాత్రి మరోసారి గొడవ జరగ్గా భర్తను తలపై కొట్టిన భార్య తాడును గొంతుకు బిగించి నడిరోడ్డుపై చంపేసింది. గ్రామస్థుల ఫిర్యాదుతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
నడిరోడ్డుపై భర్తను చంపిన భార్య
03
Jan