యూపీలోని ప్రయాగ్జ్లో సోమవారం నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుక ఫిబ్రవరి 26 వరకు సాగనుంది.
ఇందులో దాదాపు 45 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. యూపీ ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది. త్రివేణి సంగమం వద్ద 12 కి.మీ మేర తాత్కాలిక ఘాట్లు, దాదాపు 2 లక్షల టెంట్లు నిర్మించింది. పారిశుద్ధ్యం కోసం 15 వేల మంది కార్మికులను నియమించారు