AP: ఆన్లైన్ బెట్టింగ్తో నష్టపోయానని,
చనిపోతున్నానంటూ సతీశ్ అనే వ్యక్తి తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తూ.గో జిల్లా కొవ్వూరు (మ) బంగారుపేటకు చెందిన సతీశ్ చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేరుపాలెం బీచ్ వద్ద నుంచి తమ్ముడికి సెల్ఫీ వీడియో పంపాడు. అందరూ తనను క్షమించాలని, పిల్లలు జాగ్రత్త అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు