ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో జరిగిన మంచు ప్రమాద ఘటనలో 32 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. మరో 25 మంది కోసం గాలిస్తున్నాయి. బయటపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని సైనికులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బద్రీనాథ్ హైవేపై నిర్మాణ పనులు జరుగుతుండగా మంచు కొండచరియలు విరిగిపడటంతో కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
మంచు ప్రమాదం.. 32 మంది సేఫ్
02
Mar